సేంద్రియ వ్యవసాయం లో ఆవు యొక్క ప్రాముఖ్యత :
భూమి
లోని సూక్ష్మ జీవులను ఉత్తేజ పరిచేందుకు ఉపయోగపడే దేశీయ లేదా నాటు ఆవుల
పేడ మాత్రమే . ఒక గ్రాము దేశీయ ఆవు పేడలో 300 కోట్ల నుంచి 500 కోట్ల
వరకు ఉపయోగపడే సుక్ష్మ జీవులు ఉంటాయి . ఇది ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల
'తోడు' లాంటిది .
కేవలం దేశీయ ఆవు మాత్రమే కావాలి . పేడ ను
తాజాగా ఉపయోగిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది . అలాగే ఆవు మూత్రము ఎంత పాతది
అయితే దాని ప్రభావము అంత ఎక్కువగా ఉంటుంది . ఒక ఎకరానికి ఒక నెలలో కనీసం
ఒకసారి 10 కిలోల దేశీయ ఆవు పేడ ని ఉపయోగిస్తే చాలు .
ట్రక్కుల కొద్దీ ,టన్నుల కొద్దీ పశువుల ఎరువును కొనుగోలు చేసి భూమికి వాడే అవసరం లేదు . కేవలం జీవామృతం ఉపయోగిస్తే చాలు . జీవామృతం తయారుచేయడానికి కేవలం దేశీయ ఆవు లేదా నాటు ఆవు పేడ ,మూత్రము మాత్రమే ఉపయోగించుట ఉత్తమం .
ఆవు
మూత్రము సేకరించు విధానము :