బీజామృతం
బీజామృతం తయారీకి కావలసిన పదార్ధాలు :
1. నీరు -20 లీటర్లు
2. ఆవు మూత్రము -5 లీటర్లు
3. ఆవు పేడ -5 కిలోలు
4. పొడి సున్నం -50 గ్రాములు
5. పుట్ట మన్ను లేదా పొలం గట్టు మన్ను -దోసెడు
తయారు చేసే విధానం :
1) ఆవు పేడ ను ఒక గుడ్డ సంచిలో మూట కట్టి 20 లీటర్ల నీరు న్న తొట్టిలో 12 గంటలు వుంచాలి .
1) ఆవు పేడ ను ఒక గుడ్డ సంచిలో మూట కట్టి 20 లీటర్ల నీరు న్న తొట్టిలో 12 గంటలు వుంచాలి .
2) ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి .
3) తరువాత రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూట ను చేత్తో పిండాలి .
4) పేడ నీళ్ళున్న తొట్టిలో పొలం గట్టు మట్టిని వేసి కర్రతో కలియ తిప్పాలి .
5) 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రాన్ని ,సున్నపు నీటిని పేడ నీరు న్న తొట్టిలో కలుపుతూ పూర్తిగా కలిసిపోయే వరకు తిప్పాలి .
విత్తన శుద్ధి చేయటానికి అవసరమైన 'బీజామృతాన్ని' ఇలా తయారు చేసుకోవాలి .ఏ పంటకు సంబంధించిన విత్తనాలైనా సరే ఈ బీజామృతం లో కలిపి ,విత్తనాలకు బాగా పట్టించి , వాటిని ఆరబెట్టి పంట వేయుటకు సిద్ధంగా ఉంచుకోవాలి .