జీవామృతం

జీవామృతం : 

ఈ జీవామ్రుతమును ద్రవ ,ఘన రూపాలలొ తయారు చేసుకోవచ్చు . మొదట ద్రవ జీవామృతం తయారీ విధానాన్ని చూద్దాము .

ఒక ఎకరం పంట పొలానికి సరిపడా  జీవామృతం తయారీకి  కావలసిన పదార్ధాలు
 దేశీయ ఆవు పేడ :10 కిలోలు
దేశీయ  ఆవు మూత్రము :5 నుండి 10 లీటర్లు

బెల్లం :2 కిలోలు

పప్పు ధాన్యాల పిండి :2 కిలోలు

పుట్ట మట్టి :పిడికెడు

జీవామృతం తయారు చేసే విధానం : 
 తొట్టి లో  కాని లేదా డ్రమ్ములో కానీ 200 లీటర్లు నీటిని  తీసుకొని  దేశీయ ఆవు పేడ ,దేశీయ  ఆవు మూత్రము ,బెల్లం,పప్పు ధాన్యాల పిండి,పుట్ట మట్టి   కలిపి ప్రతి రోజు రెండు లేదా మూడు సార్లు కర్రతో సవ్య ,అపసవ్య  దిశలలో కలియ త్రిప్పాలి . 48 గంటల తరువాత ఈ జీవామ్రుతాన్ని  పంట పొలానికి నీరు పారే  సమయంలో నీటితో కలిపి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి .

                                                     ప్రతి 15 రోజులకు లేదా 30 రోజులకు ఒక సారి జీవామ్రుతమును నీటితోపాటు అందించాలి . దీనివల్ల భూమి సారవంతం అవుతుంది. జీవామృతం తయారీ 2 పద్ధతుల్లో వివరించ బడ్డాయి . జీవామృతం తయారీ మొదటి పధ్ధతి శ్రీ సుభాష్ పాలేకర్ గారి ని అనుసరించి  వీడియో తయారు చేయడం జరిగింది .