శిలీంద్ర నాశిని


గోబాణం:(శిలీంద్ర నాశిని) నీటిలో ,పుల్లటి మజ్జిగ ను కలిపితే గోబాణం తయారవుతుంది . ఒక ఎకరానికి 100 లీటర్లు నీళ్లలో, 6 లీటర్లు పుల్లటి మజ్జిగ ను కలిపి పంట పై పిచికారీ చేసుకోవాలి .దీన్ని పిచికారీ చేయడం ద్వారా ఫంగస్ బెడద నుంచి పంటలను కాపాడుకోవచ్చు .

ఆవు మూత్రము -పేడ -ఇంగువ ద్రావణం :

వరి లో వచ్చు తెగుళ్ళను సమర్ధవంతం గా అరికడుతుంది. 

కావలసిన పదార్ధాలు :

దేశీయ ఆవు లేదా నాటు ఆవు మూత్రం : 5 లీటర్లు
దేశీయ ఆవు లేదా నాటు ఆవు పేడ : 5 కిలోలు
మంచి నీరు : 5 లీటర్లు 
ఇంగువ పొడి  : 100 గ్రాములు 

 

 

తయారీ విధానం : 

మట్టి కుండ లోగాని లేదా ప్లాస్టిక్ పాత్రలో గాని ,దేశీయ ఆవు లేదా నాటు ఆవు మూత్రం 5 లీటర్లు ,దేశీయ ఆవు లేదా నాటు ఆవు పేడ 5 కిలోలు, మంచి నీరు 5 లీటర్లు, పై పదార్ధాలు అన్నీ కలిసిపోయేలా కలియ బెట్టాలి. 4 రోజులు పులియ  నివ్వాలి  .

                   ఐదవ రోజు 1 లీటరు నీరు మరిగించి పొంగు వచ్చే సమయములో ఇంగువ వేసి చల్లార్చి ,ఆ నీటిని వడపోసిన ఆవు మూత్రము ,పేడ ద్రావణం లో కలిపి సాయం సమయములో పంటపై పిచికారీ చేయాలి .వరి పంటపై వచ్చు బాక్టీరియా తెగుళ్ళ ను కూడా సమర్ధ వంతముగా అరికడుతుంది .